Latest Video :

మాయాజాలం

మాయాజాలం
తిరుపతి లో ఆంధ్ర మెజీషియన్ లు నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఇంద్రజాల సభలు జరుగుతున్నాయి. ఆశ్చర్యమేమిటంటే ఇక్కడ ఇంకా పెద్ద స్థాయిలో ఇంద్రజాలం జరుగుతోంది. పీ సీ సర్కార్ సీనియర్ తరువాత ఆయన పరంపరని కొనసాగించాడు జూనియర్ పీ సీ సర్కార్...కానీ.ఇక్కడ సీనియర్ వై ఎస్ 'సర్కార్ ' తరువాత జూనియర్ వై ఎస్ కి అలా జరగలేదు. రాజకీయమనే ఇల్ల్యూజన్ లు ఇంకా వంటబట్టించుకోకపోవడమే దీనికి కారణమనుకుంటా...రక రకాల బిజినెస్సుల్లో బిజీ గా మెస్సై పోవడం వల్ల...కాబోలు.


సీనియర్ సర్కార్ రాష్ట్రమంతటా పర్యటించి...తన ఇందిరాజలం తో జనాల్ని సమ్మోహితుల్ని చేసి ఎసెంబ్లీ హౌసు ఫుల్లు కాక పోయినా కలెక్షన్ కి సీ ఎం సెలెక్షన్ కీ కావాల్సినంత చేసుకోగలిగాడు..ఐతే..పావురాల గుట్ట ????... మెజీషియన్ లు ఎక్కువగా పావురాలతోనే మేజిక్ చేస్తారు. అక్కడ అనుకోంది దుర్ఘటన తో..అందరికీ దూరమైనాడు. కానీ ఆయన కొనసాగింపు..వారసుడికి రాలేదు. సాధారణంగా వారసత్వాన్నే పౌరసత్వంగా భావించే కాంగ్రెస్ ఈ సారి ఎందుకనో? అలా జరక్కుండా..పీఠం జారకుండా జాగ్రత్త పడ్డారు.
బడ్జెట్ మంత్రిగారు..అదే ఆర్ధిక మంత్రిగారు..ఎలాగూ జిమ్మిక్కులు..అప్పులు-ఆస్తుల మేజిక్కులు..ప్రతిపక్షం వారిని నోరుమూయించగల లాజిక్కులు చాలా తెలుసు కాబట్టి..నెమ్మదిగా.ముఖ్య.మంత్ర దండం అందుకుని తిప్పుతున్నారు.


ఎలాగూ టోపీల్లోంచి వచ్చేవి 'కుందేళ్ళే " గనక ఖంగారు లేకుండా...నడిపించేస్తున్నారు రోశయ్య గారు. ఇండియన్ రోప్ ట్రిక్కు లాగా అందరినీ ఒక్క తాటి మీద నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. కొరకరాని కొండ లుంటే,,డబ్బా లో పెట్టి మాయం చెయ్యగల సమర్ధులు. వారు.


ఢిల్లీలో చూద్దామా అంటే ...సీనియర్ వై ఎస్ సర్కార్ కి మేనేజర్ ఐన కె వీ పీ గారికి ఏం చెయ్యాలో అర్ధం కాని పరిస్థితి..మేనేజ్మెంట్ లేకుండానే షో నడుస్తోంది..సోనియా చూస్తే ఫ్యూచర్ ప్రోగ్రాం గురించి చెప్పటం లేదు. గట్టిగా అడిగితే మేనేజర్గిరీ కే ప్రమాదమేమో కూడా.


మొత్తానికి..ప్రస్తూం ఆంధ్ర గవర్నమెంటు 'జంతర్ మంతర్ ' తిరుపతిలో జరగనున్న జాతీయ ఇంద్రజాలికుల సదస్సుకి శుభాభినందనలు శుభాకాంక్షలతో ..


నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share this article :
 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. Daggara Darshini - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger